భూ సమస్యల పరిష్కారానికే భూభారతి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి

Jun 14 2025 7:41 AM | Updated on Jun 14 2025 7:41 AM

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి

ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా భూసమస్యలు పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో సహకార శాఖ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సమస్యలపై అధికారులు జారీ చేసిన ఆర్డర్లపై అభ్యంతరం ఉంటే అప్పీల్‌ చేసుకోవచ్చని తెలిపారు. గతంలో సివిల్‌ కోర్టుల ద్వారా మాత్రమే లభించే పరిష్కారం కొత్త చట్టంతో రెవెన్యూ వ్యవస్థ వద్ద లభిస్తుందని చెప్పారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్‌ విచారించి మ్యుటేషన్‌ చేస్తారని తెలిపారు. అనంతరం చట్టంపై పలువురి సందేహాలను అదనపు కలెక్టర్‌ నివృత్తి చేశారు. డీసీసీబీ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా సహకార అధికారి జి.గంగాధర్‌, డీసీసీబీ సీఈఓ ఎన్‌.వెంకట్‌ఆదిత్య, వరంగల్‌ కోఆపరేటివ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ రాజయ్య, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు ఎండీ.అన్వర్‌, కె.కిషోర్‌తో పాటు పీఏసీఎస్‌ల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement