
●గ్రూప్–1 ఫలితాల్లో సత్తా
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడుకు చెందిన తుమ్మలపల్లి సంజయ్ గ్రూప్–1 ఫలితాల్లో 469 మార్కులు సాధించి ఈడబ్ల్యూఎస్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్, జనరల్ విభాగంలో 249 ర్యాంక్ సాధించాడు. సంజయ్ తల్లితండ్రులు నర్సింహారావు, ఉమ బూడిదంపాడు గ్రామ సెంటర్లో హోటల్ నడుపుతున్నారు. సంజయ్ 1 నుంచి 5 వరకు బల్లేపల్లిలోని ఎస్ఎఫ్ఎస్లో, 10వ తరగతి వరకు ఖమ్మంలోని గీతమ్స్లో, ఇంటర్, డిగ్రీ, గ్రూప్స్ పరీక్షల కోసం నారాయణ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నట్లు సంజయ్ తండ్రి తెలిపారు. సంజయ్ను పలువురు అభినందిస్తున్నారు.