జేఏసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు | - | Sakshi
Sakshi News home page

జేఏసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

Mar 28 2025 1:49 AM | Updated on Mar 28 2025 1:46 AM

ఖమ్మం సహకారనగర్‌ : నగరంలోని టీఎన్జీవోస్‌ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఇఫ్తార్‌ విందు కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్‌ మాసం ఆధ్యాత్మికతకు, స్వీయ క్రమశిక్షణకు ఉత్తమ సమయమని అన్నారు. దానధర్మాలతో పేదలను ఆదుకునేందుకే ఈ పండుగ జరుపుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్‌ గుంటుపల్లి శ్రీనివాసరావు, కో కన్వీనర్‌ కస్తాల సత్యనారాయణ, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు యలమద్ది వెంకటేశ్వర్లు, పారుపల్లి నాగేశ్వరరావు, కొణిదన శ్రీనివాస్‌, మోదుగు వేలాద్రి, చంద్రకంటి శశిధర్‌, చర్ల శ్రీనివాసరావు, వాసిరెడ్డి శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, కృష్ణార్జున్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement