ఖమ్మం రాపర్తినగర్/చింతకాని: ఖమ్మం– పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడో లైన్ నిర్మాణ పనులను అధికారులు సోమవారం పరిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి, డీఆర్ఎం భర్తేష్కుమార్ జైన్ తనిఖీల్లో పాల్గొనగా.. ఇప్పటివరకు పూర్తయిన లైన్పై రైలు నడిపించారు. మరోమారు పూర్తిస్థాయిలో సేఫ్టీ రన్ చేపట్టాక రైళ్లు నడపడానికి అనుమతిస్తామని అధికారులు తెలి పారు. ఖమ్మం స్టేషన్ మాస్టర్ ప్రసాద్, అధికారులు శ్రీకాంత్రెడ్డి, సంజీవ్ యాదవ్, సునీల్కుమార్ వర్మ, సత్యప్రకాష్, సురంజన్రెడ్డి, శ్రీనివాసరావు, గుడేషర్ తదితరులు పాల్గొన్నారు. ఈమేరకు పందిళ్లపల్లి స్టేషన్లో అధికారులు మొక్కలు నాటారు.
●చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి స్టేషన్లో గూడ్స్ రైళ్ల ద్వారా సరుకుల దిగుమతికి రేక్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నందున స్థానికులకే హమాలీలుగా అవకాశం కల్పించాలని పలువురు కోరారు. ఈ సందర్భంగా అధికారులకు హమాలీ వర్కర్ల యూనియన్ బాధ్యులు వినతిపత్రం అందజేశారు. ఖమ్మంలోని రేక్ పాయింట్లో హమాలీలుగా పనిచేసిన వారితో పాటు పందిళ్లపల్లి, రామకృష్ణాపురం, గాంధీనగర్కాలనీ, అనంతసాగర్, కొదుమూరు, లచ్చగూడెం వాసులకు సైతం అవకాశం కల్పించాలని కోరారు.