ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించండి

Mar 25 2025 12:11 AM | Updated on Mar 25 2025 12:10 AM

ఖమ్మం సహకారనగర్‌: ప్రజలు అందిస్తున్న ప్రతీ ఫిర్యాదును పరిశీలించడమే కాక సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ఆదేశించారు. ప్రజావాణి(గీవెన్స్‌ డే)లో భాగంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంలో జాప్యం జరగదొద్దని సూచించారు. ఒకవేళ ఏదైనా దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియచేయాలని చెప్పారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌ డేలో కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement