చిక్కమగళూరులో పీర్ల ఊరేగింపు
కలబుర్గిలో మొహర్రం ఊరేగింపులో అశేష సంఖ్యలో పాల్గొన్న ముస్లింలు
ధార్వాడలో మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న ముస్లిం యువకులు
గుండెల నిండా త్యాగనిరతి.. కనుల నిండా భక్తిప్రపత్తి.. యుద్ధంలో పోరాడి ధర్మాన్ని గెలిపించిన హజ్రత్ హుసేన్ ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు శుక్రవారం పీర్ల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హుసేన్, హసేన్ పీర్లనువెండి గొడుగులు, వివిధ పూలతో అలంకరించి ఊరేగించారు. పీర్లను నిప్పుల గుండంలో దాటించి అనంతరం జలధికి తరలించారు. డప్పుల దరువుకు యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులు పీర్ల మకాన్ల వద్ద చక్కెర చదివించి మొక్కులు తీర్చుకున్నారు.


