పంటకు ట్యాంకర్‌ నీరే శరణ్యం | - | Sakshi
Sakshi News home page

పంటకు ట్యాంకర్‌ నీరే శరణ్యం

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

హొసపేటె: వర్షాలు లేక పోవడంతో మరియమ్మనహళ్లి సమీపంలోని హంపినకట్టె–వెంకటాపుర గ్రామానికి చెందిన రైతు లక్ష్మవ్వ తన నాలుగున్నర ఎకరాల్లో పండించిన జొన్న పంటను కాపాడుకోడానికి ట్యాంకర్‌ నీటిని ఆశ్రయించడం కనిపించింది. హంపినకట్టె–వెంకటాపుర గ్రామానికి చెందిన రైతు లక్ష్మవ్వ, మొదట్లో బాగా కురిసిన రోహిణి వర్షాలకు మొక్కజొన్న, జొన్న రకాలను విత్తారు. ప్రస్తుతం ఆమె పంట కోతకు వచ్చి ఒకటిన్నర నెలలైంది. గత 20 రోజులుగా వర్షాలు లేక పోవడంతో, తేమ లేక పోవడం వల్ల పంటలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. పంటలను కాపాడుకోడానికి మరో మార్గం లేక ఆమె నీటిని అద్దెకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. సుమారు రూ.40 వేలు ఖర్చు చేసి, నాలుగున్నర ఎకరాలలో ఒక ఎకరంలో మొక్కజొన్న, మూడున్నర ఎకరాల్లో జొన్న విత్తనాలు వేశారు. ఇప్పుడు నెల రోజులుగా పెరుగుతున్న పంటలు వర్షాలు ఆగిపోవడంతో ఎదుగుదల నిలిచిపోయి వాడిపోయే దశకు చేరుకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement