
యోగా.. ఆరోగ్యానికి మంచిదేగా.!
సాక్షి,బళ్లారి: పురాతన కాలం నుంచి యోగాకు విశిష్ట గుర్తింపు ఉంది. శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకపోయినా, మన పుట్టుక నుంచి వచ్చిన ఎన్నో రోగాలు, ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్ల ద్వారా వచ్చిన రోగాలను సైతం యోగా ద్వారా దూరం చేస్తున్న హఠయోగ నాగరాజు అడ్వాన్స్ హఠయోగా ద్వారా బీపీ, సుగర్, థైరాయిడ్, న్యూరాలాజికల్ డిజార్డర్స్, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, లైఫ్ స్టైయిల్ డిజార్డర్స్తో వచ్చే అనారోగ్యాలను దూరం చేస్తున్నారు. నగరంలోని మోకా రోడ్డులోని ఎంఆర్వీ లేఅవుట్లో ఆదర్శ యోగా సెంటర్లో విశిష్టమైన యోగాను నేర్పుతూ ఎందరికో ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ కేరళలో అడ్వాన్స్ యోగా నేర్చుకున్నానన్నారు. అక్కడ వినూత్నశైలిలో యోగా నేర్పిన గురువు ద్వారా తాను యోగా శిక్షణ ఇస్తున్నానన్నారు. యోగా నేర్పుతూ ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న రోగాలను సైతం దూరం చేస్తున్నానన్నారు.
ప్రతి ఒక్కరికీ యోగా అవసరం
మారుతున్న కాలానుగుణంగా, ఆహారపు అలవాట్లు మారిపోవడంతో పాటు తగిన శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో రోజురోజుకు ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ఏదో రకమైన ప్రభావం చూపుతోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలో మోకా రోడ్డులోని ఎంఆర్వీ లేఅవుట్లో ఆదీశ యోగా సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాన్ని అసిస్టెంట్ కమిషనర్ ప్రమోద్ కుమార్, యోగా శిక్షకుడు నాగరాజు తదితరులు ప్రారంభించి మాట్లాడారు. ప్రతి రోజు యోగా నిర్వహించడం దినచర్యలో భాగం కావాలన్నారు. వాకింగ్, క్రీడలతో పాటు యోగా కూడా ఎంతో అవసరం అన్నారు. యోగా ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చన్నారు. ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుందన్నారు. పురాతన కాలం నుంచి యోగాకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇటీవల యోగా చేయడంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందన్నారు. ఇంకా ఇంటింటా యోగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి యోగా చేయించాలన్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఆయా యోగా సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం చేరి యోగా రిహార్సల్స్ చేశారు. వివిధ యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు.
యోగా సాధనతో ఏదైనా సాధ్యం
రాయచూరు రూరల్: పేదరికంలో పుట్టి కష్టాలను అనుభవించినా యోగా ద్వారా పేరు ప్రఖ్యాతులు సాధించిన డాక్టర్ వడ్డేపల్లి తిమ్మప్ప పలువురికి యోగా నేర్పిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో తిమ్మప్ప యోగా సాధకుడిగా మంచి పేరు సాధించారు. అరోగ్యాన్ని కాపాడుకోడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని యోగాతో నలుగురికి సహాయ పడాలనే ఉద్దేశ్యంతో యోగా శిక్షణ ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు, జైళ్లలో ఖైదీలకు, అనాథఽ పిల్లలకు, సామాన్య ప్రజలకు ఉచితంగా యోగాసన శిబిరాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ వడ్డేపల్లి తిమ్మప్ప జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు యోగాబ్యాస పోటీల్లో పాల్గిని పలు అవార్డులు పొందారు.
12 ఏళ్లుగా యోగా శిక్షణ అందిస్తున్న నాగరాజు
కేరళలో యోగా గురువు ఆనంద్తో శిక్షణ
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
సందర్భంగా ప్రత్యేక కథనం

యోగా.. ఆరోగ్యానికి మంచిదేగా.!

యోగా.. ఆరోగ్యానికి మంచిదేగా.!

యోగా.. ఆరోగ్యానికి మంచిదేగా.!

యోగా.. ఆరోగ్యానికి మంచిదేగా.!