కేకేఆర్‌డీబీ కార్యదర్శిగా నళిన్‌ అతుల్‌ | - | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌డీబీ కార్యదర్శిగా నళిన్‌ అతుల్‌

Jun 21 2025 3:41 AM | Updated on Jun 21 2025 3:53 AM

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక గ్రామీణ అభివృద్ధి మండలి(కేకేఆర్‌డీబీ) కార్యదర్శిగా నళిన్‌ అతుల్‌ నియమితులయ్యారు. గురువారం సాయంత్రం కేకేఆర్‌డీబీ కార్యాలయంలో సుందరేష్‌ బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు, కొప్పళ జిల్లాధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారికి పదోన్నతి కల్పించి కార్యదర్శి హోదాకు బదిలీ చేశారు. గతంలో రాయచూరు జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, పాఠశాల విద్య పరీక్ష మండలి చీఫ్‌గా, కేపీఎస్‌సీ అధికారిగా, విద్యా శాఖ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహించిన అనుభవంతో ఆయనను మండలి కార్యదర్శిగా బదిలీ చేశారు.

రాయచూరు వర్సిటీ

రిజిస్ట్రార్‌గా చెన్నప్ప

రాయచూరు రూరల్‌: రాయచూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా చెన్నప్ప పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉన్న రిజిస్ట్రార్‌ శంకరప్పను బదిలీ చేయడంతో ఆయన స్థానంలో చెన్నప్ప బాధ్యతలు చేపట్టారు. గతంలో రిజిస్ట్రార్‌ శంకరప్ప రాయచూరు, యాదగిరి జిల్లాల్లో రాయచూరు విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో పేరుకు పోయిన సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవడంతో ఆయనను బదిలీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

పౌర కార్మికులకు కిట్ల పంపిణీ

రాయచూరు రూరల్‌: యాదగిరి నగరసభ పౌర కార్మికులకు నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపూరే కిట్లను పంపిణీ చేశారు. శుక్రవారం యాదగిరి నగరంలోని నగరసభ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రం యాదగిరిలో పరిశుభ్రత మెరుగు పరిచేందుకు కృషి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

పంట నష్టపరిహారం ఇవ్వాలి

హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని కుందగోళ తాలూకాలో భారీ వర్షాలతో బెణ్ణెహళ్ల వాగు, వరదలతో పంటలు, రోడ్లు, వంతెనలు దెబ్బ తిన్నాయని, వీటి మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ జేడీఎస్‌ కార్యకర్తలు తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. నూర, అంచినాళ గ్రామాల మధ్యలో ప్రవహించే కట్టిహళ్ల వాగుకు వరదలతో మృతి చెందిన కుందగోళ నివాసి శివయ్య కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి. బెణ్ణిహళ్ల అభివృద్ధికి తక్షణమే రూ.200 కోట్లు విడుదల చేయాలని ఆ తాలూకా జేడీఎస్‌ అధ్యక్షుడు శంకర్‌గౌడ డిమాండ్‌ చేశారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు వరద పాలై రైతన్నలు కష్టాల్లో ఉన్నారని, వారికి తగిన పంట పరిహారం చెల్లించాలని కోరారు. జేడీఎస్‌ గంగాధర మఠ, గురురాజ్‌, నిరంజనయ్య, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల భవనం ప్రారంభం

హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని సీతారామ తండాలో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక సీనియర్‌ పాఠశాల కొత్త భవనాన్ని ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌ గవియప్ప ప్రారంభించారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు అన్ని సౌకర్యాలతో కూడిన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత బీజేపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి ఆనంద్‌సింగ్‌ రూ.కోటి నిధుల గ్రాంట్‌ను విడుదల చేశారు. పాఠశాల భవనం ప్రారంభోత్సవంలో బీఈఓ శేఖర్‌ హొరపేటె, సీతారామ తాండ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు గోవింద నాయక్‌, ఎస్డీఎంసీ అధ్యక్షుడు రామమూర్తి, ఇతర తండా నాయకులు పాల్గొన్నారు.

చెక్‌ బౌన్స్‌ కేసులో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

మైసూరు : ఒక వ్యక్తిని అక్రమంగా బంధించి చెక్కుపై సంతకం చేయాలని బలవంతం చేసిన బెంగళూరు వ్యాపారవేత్తలు గోవిందప్ప, పూజారి సురేష్‌, వారి అనుచరులు సుఖేష్‌శెట్టి, ప్రజ్వల్‌లపై ఎఫ్‌ఐఆర్‌, కేసులు నమోదయ్యాయి. ఎన్‌ఆర్‌ మొహల్లా నివాసి సునీల్‌, అతని భార్య కవిత సంతకం చేసిన చెక్కులను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారు ఐదు చెక్కుల్లో రూ. 21 లక్షలు నమోదు చేసుకుని బౌన్స్‌ చేసి వారెంట్‌ తెచ్చారు. ఈ పరిణామంతో కలత చెందిన సునీల్‌, అతని భార్య కవిత న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. మూడేళ్ల పాటు విచారణ జరిపిన తర్వాత మైసూరు కోర్టు వ్యాపారవేత్తలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది.

కేకేఆర్‌డీబీ కార్యదర్శిగా నళిన్‌ అతుల్‌ 1
1/3

కేకేఆర్‌డీబీ కార్యదర్శిగా నళిన్‌ అతుల్‌

కేకేఆర్‌డీబీ కార్యదర్శిగా నళిన్‌ అతుల్‌ 2
2/3

కేకేఆర్‌డీబీ కార్యదర్శిగా నళిన్‌ అతుల్‌

కేకేఆర్‌డీబీ కార్యదర్శిగా నళిన్‌ అతుల్‌ 3
3/3

కేకేఆర్‌డీబీ కార్యదర్శిగా నళిన్‌ అతుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement