కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు | - | Sakshi
Sakshi News home page

కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు

Jun 18 2025 3:15 AM | Updated on Jun 18 2025 3:15 AM

కాటేస

కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు

హుబ్లీ: పొలంలో సాగు పనులు చేసుకుంటున్న సందర్భంగా రైతుకు పాము కాటు వేసింది. దీంతో ఆ రైతు సదరు పామును పట్టుకొని నేరుగా ఆస్పత్రికి వచ్చిన అరుదైన ఘటన బెళగావి బిమ్స్‌ ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. బెళగావి తాలూకా అంబేవాడి గ్రామం వదద పొలంలో పని చేస్తున్న యల్లప్పను పాము కాటు వేసింది. కట్ల పాము అనే విషకారి పాము కాటు వేసిన నేపథ్యంలో సదరు పామును ప్లాస్టిక్‌ డబ్బాలో బంధించి దానితో పాటు బిమ్స్‌ ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందాడు. పామును పట్టుకొని రావడంతో బెళగావి జిల్లా ఆస్పత్రిలో రోగులు కాసేపు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బెళగావి గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థులు సమాజ సేవకు ముందడుగు వేయాలి

రాయచూరు రూరల్‌: విద్యార్థులు చదివిన విద్యకు సమాజంలో గౌరవ ప్రదంగా సేవలు అందించాలని హైదరాబాద్‌ ఐఐఐటీ డైరెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌ కుమార్‌ పరదాన్‌ పేర్కొన్నారు. యరమరస్‌ హైదరాబాద్‌ కర్ణాటక విద్యా సంస్థ ఎం.విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్య ముగించిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రసంగించారు. వివిధ కోర్సుల్లో పట్టాలు పొందిన ప్రతి ఒక్కరు జవాబుదారితో చదివిన విద్య సార్థకం కావాలంటే మంచి సేవలు అందించడానికి ముందడుగు వేయాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనశీలత, ప్రతిభను వెలికి తీసి ప్రజలు గుర్తుంచుకొనేలా జీవితాలను రూపొందించుకోవాలన్నారు. సభ్యులు నిశాంత్‌, అనిల్‌ కుమార్‌, కిరణ్‌, ప్రిన్సిపాల్‌ బసవరాజ్‌, అశ్విన్‌, విజయేంద్ర, సంగమేష్‌, వర్మ, స్నేహ, శ్రుతి పాటిల్‌లున్నారు.

శాంతిదూత అల్లమ ప్రభు

రాయచూరు రూరల్‌: సమాజంలో శాంతి, ధర్మం, న్యాయం వంటి అంశాలను చాటడంలో మహాజ్ఞాని అల్లమ ప్రభువు అని శరణ బసవ అప్ప పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన మహాజ్ఞాని అల్లమ ప్రభు జీవిత చరిత్రను గురించి జరిగిన సమావేశంలో భక్తులనుద్దేశించి మాట్లాడారు. నిరాకారమైన రూపం, వర్ణం లేని శివశక్తి నుంచి ఉదయించిన ఆత్మ గుహేశ్వర ద్వారా పరమాత్ముడు అనే విషయాన్ని వివరించారు. మానవుడి జీవితం దుఖంతో కూడిందన్నారు. ఎవరు చేసిన కర్మ ఫలం వారు అనుభవించక తప్పదన్నారు. వీరశైవ లింగాయత సమాజం అధ్యక్షుడు శరణ భూపాల నాడగౌడ, విరుపనగౌడ, వీరనగౌడ, పాటిల్‌, శరణగౌడ, బసవరాజ్‌లున్నారు.

విద్యుత్‌ కోతలు నివారించండి

రాయచూరు రూరల్‌: నగరంలో విద్యుత్‌ కోతల నివారణకు చర్యలు చేపట్టాలని కరవే డిమాండ్‌ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఖలీల్‌ పాషా మాట్లాడారు. రాయచూరులో ఆర్టీపీఎస్‌, వైటీపీఎస్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలున్నా తరచుగా విద్యుత్‌ కోత అధికంగా విధిస్తున్నారన్నారు. దీంతో 43 మురికి వాడల ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని, కోతల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

పెంచిన వేతనాలు చెల్లించాలి

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు పెంచిన వేతనాలను త్వరగా చెల్లించాలని అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు వరలక్ష్మి డిమాండ్‌ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యకర్తలను పర్మినెంట్‌ చేయాలని గుజరాత్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. రూ.12 వేల గౌరవ వేతనాన్ని చెల్లిస్తామని అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. పెంచిన గౌరవ వేతనాన్ని ఏప్రిల్‌ 1 నుంచి అమలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను జారీ చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేలు వేతనమివ్వాలని, పదవీ విరమణ అనంతరం రూ.10 వేలు పింఛన్‌ చెల్లించాలన్నారు.

కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు1
1/4

కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు

కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు2
2/4

కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు

కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు3
3/4

కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు

కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు4
4/4

కాటేసిన పాముతోనే ఆస్పత్రికి రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement