విద్యుదాఘాతానికి బలి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి బలి

Jun 18 2025 3:15 AM | Updated on Jun 18 2025 3:15 AM

విద్య

విద్యుదాఘాతానికి బలి

హొసపేటె: కొండనాయకనహళ్లిలోని మాగాణి పొలంలో మేస్తున్న గేదె, దూడలపై విద్యుత్‌ తీగ తెగి పడటంతో విద్యుత్‌ షాక్‌కు గురై పొలంలోనే అవి చనిపోయిన సంఘటన గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. గ్రామంలో నివసించే గూగి ప్రకాష్‌ అనే రైతుకు చెందిన విలువైన గేదె, దూడ మృత్యువాత పడ్డాయి. దీంతో పాలు అమ్మడం ద్వారా జీవనోపాధి పొందే రైతు తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. బాధిత గేదెల యజమానికి వెంటనే పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

సమస్యలు పరిష్కరిస్తాం

రాయచూరు రూరల్‌: వినియోగదారుల సమస్యలపై స్పందిస్తామని వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు మాలతి పాటిల్‌ పేర్కొన్నారు. మంగళవారం యాదగిరి జిల్లా కోర్టులో అధికార బాధ్యతలు స్వీకరించి ఆయన మాట్లాడారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు చేపడతామన్నారు. వినియోగదారుల సంఘం సభ్యుడు ప్రభాకర్‌ పాటిల్‌, శరణే గౌడ, వినయ్‌ కులకర్ణిలున్నారు.

ఎరువులు, విత్తనాల

కొరత రానీయొద్దు

రాయచూరు రూరల్‌: తాలూకాలో ఖరీఫ్‌ పంటలు సాగు చేసే రైతులకు ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చూడాలని బీదర్‌ గ్రామీణ శాసన సభ్యుడు బండెప్ప కాశంపూర్‌ సూచించారు. మంగళవారం బీదర్‌ తాలూకా కమఠాణా రైతు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టిన రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కాగా వరి 308 క్వింటాళ్లలో 228 క్వింటాళ్లు, కందులు 195.6 క్వింటాళ్లలో 162.05 క్వింటాళ్లు, పెసలు 1.45 క్వింటాళ్లలో 1.15 క్వింటాళ్లు, సజ్జలు 2.1 క్వింటాళ్లలో 1.89 క్వింటాళ్లు, ఎరువులు 13,939 మెట్రిక్‌ టన్నుల్లో 20,179 మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉంచామని అధికారులు వివరించారు.

పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ

రాయచూరు రూరల్‌: పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని పిల్లల రక్షణ హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు నాగణ్ణగౌడ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అధ్యక్షుడు ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మాట్లాడారు. ఆంగ్ల బాష సర్కారీ పాఠశాలను పరిశీలించి వసూలు చేస్తున్న ఫీజులు, డొనేషన్ల గురించి ఆరా తీశారు. విద్యార్థులు సహాయవాణి 1098, పోలీస్‌ సహాయవాణి 112 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు మంచి అహారాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచేలా చూడాలని బీఈఓ ఈరణ్ణను ఆదేశించారు. రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించి రోగుల నుంచి వివరాలు సేకరించారు. ఆయన వెంట అధికారులు అమరేష్‌, హనుమేష్‌, రాఘవేంద్రలున్నారు.

అల్లరితో విసిగి బిడ్డకు వాతలు.. తల్లి అరెస్ట్‌

హుబ్లీ: సొంత బిడ్డ చేయరాని అల్లరి పని చేశాడంటూ ఆ తల్లి కన్న బిడ్డను ఇనుప కడ్డీతో చేతులు, కాళ్లు, మెడ భాగంలో వాతలు పెట్టిన ఘటన హుబ్లీలో చోటు చేసుకుంది. ఆ మేరకు వాతలు పెట్టిన ఆరోపణలపై అనుషా ఉలిమర అరెస్ట్‌ అయిన మహిళ. సోమవారం పాత హుబ్లీలోని టిప్పునగర్‌ 4వ క్రాస్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నిందితురాలు తన బిడ్డ ప్రవర్తనతో కోపగించుకొని క్రూరమైన శిక్ష విధించినట్లు సమాచారం. అనుషా తన బిడ్డ చేతులు, కాళ్లు, మెడపై ఇనుపకడ్డీతో తీవ్రంగా వాతలు పెట్టి గాయపరిచింది. పాత హుబ్లీ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. వాతలు తిన్న బాధతో బిడ్డ అరుపులు ఇరుగు పొరుగు వారికి వినిపించడంతో వారందరూ పరుగున వచ్చి బాలుడిని రక్షించారు. ఈ దారుణ కృత్యంపై స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విద్యుదాఘాతానికి బలి1
1/3

విద్యుదాఘాతానికి బలి

విద్యుదాఘాతానికి బలి2
2/3

విద్యుదాఘాతానికి బలి

విద్యుదాఘాతానికి బలి3
3/3

విద్యుదాఘాతానికి బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement