
రాఘవుని సన్నిధిలో కేంద్ర మంత్రి
రాయచూరు రూరల్: మంత్రాలయ మఠంలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాత్రి మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ మంత్రికి శాలువా కప్పి సన్మానించారు. సాయంత్రం రాయల సేవలో పునీతులై రథోత్సవం నిర్వహించారు.
మారణకాండ నిలిపేయాలి
రాయచూరు రూరల్: గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న మారణకాండను వెంటనే నిలిపి వేయాలని ఒత్తిడి చేస్తూ సీపీఐ(ఎంఎల్), ఎస్యూసీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. పాలస్తీనా దేశఽ ప్రజలకు భారత్ సౌహార్దతను ప్రకటించాలన్నారు. ఈ విషయంలో భారతదేశం విధివిధానాల్లో మార్పు చేసుకొని జాతీయ సౌహార్దతా దినోత్సవంగా ప్రకటించాలన్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి, శరణ బసవ, అయ్యాళప్ప, బసవలింగప్ప, వీరేష్లున్నారు.

రాఘవుని సన్నిధిలో కేంద్ర మంత్రి