జోరుగా వర్షాలు.. పొంగిన నదులు | - | Sakshi
Sakshi News home page

జోరుగా వర్షాలు.. పొంగిన నదులు

Jun 17 2025 5:26 AM | Updated on Jun 17 2025 5:26 AM

జోరుగ

జోరుగా వర్షాలు.. పొంగిన నదులు

రాయచూరు రూరల్‌: పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు పడుతుండడంతో కృష్ణా పరివాహక ప్రాంత నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో ఆదివారం రాత్రి, సోమవారం కొన్ని గంటల పాటు భారీగా వానలు కురిశాయి. ఎగువన మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో భారీగా వానలు పడుతుండటంతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. మరోవైపు ధార్వాడ, గదగ్‌ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో వాగుల్లో వరద నీటి ఉధృతి పెరిగింది. ఫలితంగా కుడచి హంచినాళ వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ప్రజలు చేయి చేయి పట్టుకుని వాగులో నడుచుకుంటూ దాటారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేక పోయారు.

రాయచూరులో..

నగరంలో సోమవారం ఓ మోస్తరు వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా రోడ్లు బురదగుంటలుగా మారాయి. హైదరాబాద్‌ రోడ్డు, ఏపీఎంసీ, మున్నూరు వాడి, గాంధీ చౌక్‌, మహావీర చౌక్‌, ఆర్టీఓ సర్కిల్‌, కూరగాయల మార్కెట్‌లో వర్షపు నీరు చొరబడ్డాయి. ప్రధాన రహదారుల్లో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

క్రమంగా పెరుగుతున్న వరద

వాహన రాకపోకలకు ఆటంకం

జోరుగా వర్షాలు.. పొంగిన నదులు1
1/2

జోరుగా వర్షాలు.. పొంగిన నదులు

జోరుగా వర్షాలు.. పొంగిన నదులు2
2/2

జోరుగా వర్షాలు.. పొంగిన నదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement