అధికారుల నిర్లక్ష్యంపై ఎంపీ మండిపాటు | - | Sakshi
Sakshi News home page

అధికారుల నిర్లక్ష్యంపై ఎంపీ మండిపాటు

Jun 17 2025 5:26 AM | Updated on Jun 17 2025 5:26 AM

అధికారుల నిర్లక్ష్యంపై ఎంపీ మండిపాటు

అధికారుల నిర్లక్ష్యంపై ఎంపీ మండిపాటు

రాయచూరు రూరల్‌: లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాల పురోగతిపై జరిగిన సమావేశంలో లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. సోమవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దిశ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత రాకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా రైతులకు 2.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జాతీయ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. వానాకాలం కావడంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మంత్రి బోసురాజు, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌, గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్‌, శాసన సభ్యులు శివరాజ్‌ పాటిల్‌, హంపయ్యనాయక్‌, హంపన గౌడ బాదర్లి, బసన గౌడ, కరెమ్మ నాయక్‌, ఎమ్మెల్సీ వసంత కుమార్‌, జిల్లాధికారి నితీష్‌, జెడ్పీ సీఈఓ రాహుల్‌ తుకారాం పాండేలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement