
స్కౌట్స్ అండ్ గైడ్స్తో క్రమశిక్షణ
రాయచూరురూరల్: స్కౌట్స్ అండ్ గైడ్స్తో క్రమశిక్షణతోపాటు దేశభక్తి అలవడుతుందని చిన్న నీటి పారుదల శాఖమంత్రి భోసురాజ్ అన్నారు. నగరంలోని ఆ సంస్థ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. స్కౌట్స్ విద్యార్థులకు యూనిఫాం ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ భవన నిర్మాణాలకు నిధులు విడుదల జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ మంత్రి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడు పి.జి.అర్ సింధ్యా, ఎంపీ కుమార నాయక్, బసవరాజ్ బోరెడ్డి, పరుశురామ, మల్లేశ్వరి పాల్గొన్నారు.