ప్రియురాలిని చంపి పాతిపెట్టాడు | - | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని చంపి పాతిపెట్టాడు

Jun 16 2025 6:55 AM | Updated on Jun 16 2025 6:55 AM

ప్రియ

ప్రియురాలిని చంపి పాతిపెట్టాడు

రాయచూరు రూరల్‌: ప్రేమించిన పాపానికి అమ్మాయిని ఆరు నెలల క్రితం హత్య చేసి పాతిపెట్టాడో కిరాతకుడు. ఈ ఘోరం గదగ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. గదగ్‌ తాలూకా నారాయణపుర గ్రామంలో మధుశ్రీ (21) అనే యువతిని సతీష్‌ హిరేమఠ (22) అనే యువకుడు ప్రేమించాడు. ప్రేమ పేరుతో షికార్లకు తీసుకెళ్లాడు. ఐదేళ్ల నుంచి ఈ ప్రేమాయణం సాగుతోంది. ఇది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు హిరేమఠతో తిరగడం మానుకోవాలని ఆమెను హెచ్చరించి గదగ్‌లోని బంధువుల ఇంట్లో ఉంచారు. గత ఏడాది డిసెంబర్‌ 16 న గదగ్‌ నుంచి మధుశ్రీ వెళ్లిపోయింది. ఈ ఏడాది జనవరి 12న బెటగేరి పోలీస్‌ స్టేషన్‌లో కనబడుట లేదనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సతీష్‌ హిరేమఠ్‌పై అనుమానంతో పోలీసుల విచారణ జరిపారు.

పెళ్లి చేసుకోమనడంతో..

ఇద్దరూ బైక్‌లో వెళ్తున్నట్లు గదగ్‌లో కొన్ని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. గట్టిగా విచారించగా నిజం కక్కాడు. పెళ్లి చేసుకోవాలని మధుశ్రీ ఒత్తిడి చేసింది, తనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఊరి బయటకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి, వాగులో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపాడు. గదగ్‌ యస్‌ఐ మారుతి, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా యువతి అస్తిపంజరం కనిపించింది. ప్రేమోన్మాది చేతిలో బలయ్యావా తల్లీ అని తల్లిదండ్రులు విలపించారు.

ఉన్మాద ప్రేమికుని దాష్టీకం

గదగ్‌ వద్ద దారుణం

ప్రియురాలిని చంపి పాతిపెట్టాడు 1
1/1

ప్రియురాలిని చంపి పాతిపెట్టాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement