
కేఆర్ఎస్ డ్యాంకు భద్రత కరువు
మండ్య: జిల్లాలోని కృష్ణరాజసాగర(కేఆర్ఎస్) డ్యాం దక్షిణ ద్వారం జలాశయం లోపలకు గుర్తు తెలియని ఇద్దరు యువకులు చొరబడి అక్కడ కటడం వద్ద వీడియోను తీసుకొని సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో జలాశయానికి భద్రత సరిగా లేదని స్తానిక ప్రజలు మండిపడుతున్నారు. కేఆర్ఎస్ జలాశయం భద్రత కోసం కర్ణాటక పారిశ్రామిక పోలీసు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బంది 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. అయినా గుర్తు తెలియని యువకులు పోలీసుల కళ్లు గప్పి దక్షిణ ద్వారం ద్వారా జలాశయంలోకి వెళ్లి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. కేఎస్ఐఎస్ఎఫ్ సహాయక కమాండెంట్ ప్రమోద్ మాట్లాడుతూ స్థానిక ప్రజల నుంచి తమకు సమాచారం వచ్చిందన్నారు. ఇద్దరు గుర్తు తెలియని యువకులు కేఆర్ఎస్లోనికి వెళ్లి వీడియో తీసినట్లు గుర్తించామన్నారు. వారితోపాటు మరో యవకుడు ఉన్నాడని తెలిపారు. త్వరలోనే ఐడీ ఆధారంగా వారిని పట్టుకుంటామని అన్నారు.
జలాశయంలోకి చొరబడిన యువకులు
సోషల్ మీడియాలో వీడియో వైరల్

కేఆర్ఎస్ డ్యాంకు భద్రత కరువు