
చాముండేశ్వరి దర్శనానికి రూ.2 వేల టికెట్
మైసూరు: ఆషాడ మాసంలో నాడశక్తి దేవత చాముండేశ్వరి దేవి దర్శనానికి దే విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ సమయంలో నేరుగా చాముండేశ్వరి దర్శనం త్వరగా కావాలని కోరుకునేవారికి రూ.2 వేల టికెట్ను కల్పించారు. గురువారం నగరంలోని జడ్పీలో ఆషాడ శుక్రవారం, చాముండేశ్వరి అమ్మవారి వేడుకల పూర్వ సిద్ధతా సమావేశం జరిగింది. ఆషాడ మాసంలో ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తోపులాటను అరికట్టేందుకు, నేరుగా దర్శనం పొందగోరే వారి కోసం రూ.2 వేల టికెట్ తీసుకురావాలని, ఈ టికెట్దారులకు కుంకుమ, అమ్మవారి ఫోటోతో ఓ కానుక పెట్టెను కూడా ఇస్తామని మంత్రి హెచ్సీ మహదేవప్ప తెలిపారు. ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ, ఎమ్మెల్సీ యతీంద్ర, జిల్లాధికారి జీ.లక్ష్మీకాంతరెడ్డి, పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్ పాల్గొన్నారు.