ఆ రోజు ఏం జరిగింది? | - | Sakshi
Sakshi News home page

ఆ రోజు ఏం జరిగింది?

Jun 12 2025 3:25 AM | Updated on Jun 12 2025 3:25 AM

ఆ రోజు ఏం జరిగింది?

ఆ రోజు ఏం జరిగింది?

బనశంకరి: ఈ నెలారంభంలో ఆర్‌సీబీ జట్టు సంబరాల సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద సంభవించిన తొక్కిసలాట దుర్ఘటనలో బెంగళూరు నగర జిల్లా కలెక్టర్‌ జగదీశ్‌ మెజస్టీరియల్‌ విచారణ కొనసాగుతోంది. బుధవారం 14 మంది క్షతగాత్రుల వాంగ్మూలం నమోదు చేశారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోగా, 50 మందికి పైగా గాయపడడం తెలిసిందే. కలెక్టర్‌ పిలుపుతో కేజీ రోడ్డులోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి పలువురు బాధితులు గాయాలతోనే వచ్చారు. ఆ రోజు ఏం జరిగింది అని ఒక్కొక్కరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

స్టేడియం అంటే భయం

మోనీశ్‌ అనే క్షతగాత్రుడు మాట్లాడుతూ.. కలెక్టర్‌ నోటీస్‌ ఇవ్వడంతో వచ్చానని, ఘటన గురించి ప్రశ్నలు అడగడంతో సమాధానం ఇచ్చానని తెలిపారు. దుర్ఘటనకు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌, రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉందని, ఒకేసారి రెండుచోట్ల కార్యక్రమం ఏర్పాటు చేయకుండా ఉండాల్సిందన్నారు. రెండురోజులు తరువాత వేడుకలు జరపాల్సిందన్నారు. విధానసౌధ వద్ద ఎక్కువమంది పోలీసులు ఉండగా, స్టేడియం వద్ద తక్కువ సంఖ్యలో నియమించారు. ఇకపై స్టేడియంలో మ్యాచ్‌ చూడాలంటే భయం వేస్తుందని వాపోయాడు. ముందుగా టికెట్లు ఇచ్చినట్లయితే ఈ దుర్ఘటన జరిగేది కాదని అన్నారు. మరోవైపు నూతన పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌ చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించారు. తొక్కిసలాటలు జరిగిన గేట్ల వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు.

తొక్కిసలాట క్షతగాత్రుల విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement