
అప్పుడు మోదీ రాజీనామా చేశారా: సీఎం సిద్దు
గౌరిబిదనూరు: బీజేపీ నాయకులకు అసత్య ప్రచారాలు చేయడం, రాజీనామాలు కోరడమే పని అని సీఎం సిద్దరామయ్య హేళన చేశారు. బుధవారం హనుమేనహళ్ళిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. విధానసౌధ ముందు ఆర్సీబీ విజయోత్సవానికి గవర్నర్ గెహ్లాట్ తమకు తాము రావడం అసత్యమని, నేను కార్యక్రమానికి వస్తూ ఉన్నాను, మీరు రావాల్సిందిగా నేను కోరగా గవర్నరు వచ్చారని తెలిపారు. కుంభమేళాలో 40–50 మంది చనిపోతే అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామాను బీజేపీ నేతలు ఎందుకు అడగలేదన్నారు. వంతెన ప్రారంభించిన రోజే కూలిపోయి 140 మంది మరణిస్తే ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. గుజరాత్లో గోద్రా హత్యాకాండలో ఎంతమంది చనిపోయారు?, అప్పుడు సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ రాజీనామా చేశారా?, ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోతే బసవరాజ బొమ్మై రాజీనామా చేశారా అని విలేకరులను ప్రశ్నించారు.
యడ్డి ఇంట పెళ్లి సందడి
శివమొగ్గ: జిల్లాలోని శికారిపురలో బుధవారం సాయంత్రం బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, ఎంపీ బీవై రాఘవేంద్ర కుమారుడైన సుభాష్, శ్రవణ వివాహ రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది. యడ్డి ప్రత్యర్థి కేఎస్ ఈశ్వరప్ప పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. యడియూరప్ప, పరివారం ఆయనను ఆత్మీయంగా పలకరించారు. ఈ పెళ్లికి ఈశ్వరప్ప వస్తారో రారో అంటూ అనే ఊహాగానాలు తొలగిపోయాయి.