
అక్కమహాదేవి వర్సిటీ మాయాజాలం
రాయచూరు రూరల్ : ఉత్తర కర్ణాటకలో పేరొందిన అక్కమహాదేవి మహిళా విశ్వవిద్యాలయం పరిధిలో మూతపడిన కళాశాలకు పరీక్ష కేంద్రం మంజూరైంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం విషయంలో రాష్ట్ర సర్కార్, రిజిస్ట్రార్ చంద్రశేఖర్ కుట్రలు అధికమయ్యాయి. విద్యార్థుల ప్రవేశాలు లేకుండా రెండేళ్లుగా మూతబడ్డ కళాశాలకు పరీక్ష కేంద్రం మంజూరు చేసిన విషయం బట్టబయలైంది. అక్కమహాదేవి మహిళా విశ్వ విద్యాలయం పరిధిలో 2024–25వ సంవత్సరంలో 119 మహిళా కళాశాలలున్నాయి. బుధవారం నుంచి డిగ్రీలో 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్ల నియామకాల్లో రిజిస్ట్రార్ చంద్రశేఖరయ్య తనకు అనుకూలమైన వారిని నియమించుకున్నారు. 119 మంది కళాశాలల్లో మూతబడ్డ దేవదుర్గ, యాదగిరి కళాశాలలకు ఇన్విజిలేటర్లను నియమించారు. 15 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. యాదగిరిలో టీఎస్ఎం డిగ్రీ మహిళా కళాశాల మూతబడి రెండేళ్లయింది. దేవదుర్గలో జే.జే.డిగ్రీ మహిళా కళాశాలలో విద్యార్థినులు తక్కువగా ఉన్నందున కళాశాలకు రిజిస్ట్రార్ చంద్రశేఖరయ్య ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలు, స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లను నియమించారు.
రిజిస్ట్రార్పై చర్యలు తీసుకుంటాం:
శాంతాదేవి
అక్క మహాదేవి మహిళా విశ్వ విద్యాలయం పరిధిలో మూతబడ్డ కళాశాలకు పరీక్ష కేంద్రాల మంజూరు విషయంలో రిజిస్ట్రార్ చంద్రశేఖరయ్యపై చర్యలు తీసుకుంటామని అక్క మహాదేవి మహిళా విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శాంతాదేవి వివరించారు. పరీక్ష కేంద్రాలను కేటాయించిన అంశం తన దృష్టికి వచ్చిందని, కళాశాలలు మూతబడ్డ విషయంపై సమగ్ర విచారణ చేస్తామన్నారు.
మూతబడ్డ కళాశాలకు
పరీక్ష కేంద్రం మంజూరా?
యాదగిరిలో రెండేళ్ల క్రితం టీఎస్ఎం డిగ్రీ మహిళా కళాశాలను మూసి వేశామని, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు చేరకపోవడంతో మూసివేశామని శాసన సభ్యుడు చెన్నారెడ్డి పాటిల్ తన్నూర తెలిపారు. మూతబడ్డ కళాశాలకు పరీక్ష కేంద్రం మంజూరైందని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యామన్నారు.
మూతబడ్డ కళాశాలకు పరీక్ష కేంద్రం మంజూరు
విజయపురలోని విశ్వవిద్యాలయం
రిజిస్ట్రార్ లీల

అక్కమహాదేవి వర్సిటీ మాయాజాలం

అక్కమహాదేవి వర్సిటీ మాయాజాలం

అక్కమహాదేవి వర్సిటీ మాయాజాలం