
కార్మికుల భద్రత ప్రధానం
రాయచూరు రూరల్: జిల్లాలోని హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల భద్రత సంస్థకు ప్రధానమని విధాన పరిషత్ సభ్యుడు, ప్రభుత్వ హామీల అమలు సమితి అధ్యక్షుడు టీఏ.శరవణ పేర్కొన్నారు. బుధవారం హట్టి బంగారు గనుల కంపెనీలో పర్యటించి అక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అక్కడ జరుగుతున్న బంగారు నిక్షేపాల తవ్వకం గురించి తెలుసుకున్నారు. ఏటా 1600 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీలో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట శాసన సభ్యులు నిరాణి, హన్మంతప్ప రుద్రప్ప, ప్రతాప్ సింహ నాయక్, అరుణ్, నవీన్, మంజునాథ్, తిప్పణప్ప కమకనూరు, మహాలక్ష్మి, డీసీ నితీష్, అధికారిణి శిల్ప, రామప్ప, ఇతర పోలీస్ అధికారులున్నారు.