
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బళ్లారి రూరల్ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని బీఎంసీఆర్సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ తెలిపారు. బుధవారం బీఎంసీఆర్సీ ఆవరణలో అఖిల భారత శస్త్రవైద్యుల వారోత్సవం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిరక్షించుకొనే బాధ్యతను స్వీకరించాలన్నారు. పర్యావరణ పరిరక్షణపై విస్తృతంగా జాగృతి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఏఎస్ఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ గడ్డి దివాకర్, కోశాధికారి డాక్టర్ వై.గురుబసవనగౌడ, బళ్లారి శాఖ అధ్యక్షుడు డాక్టర్ శేఖప్ప మాళగిమని, ప్రముఖ శస్త్రవైద్యులు డాక్టర్ అరుణ్ ఎస్.కె, డాక్టర్ అరుణ కామినేని, డాక్టర్ కాసా సోమశేఖర్, డాక్టర్ సోమేశ్వర గడ్డి, డాక్టర్ అరవింద్ పాటిల్, బీఎంసీఆర్సీ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు.