
ఉన్నత విద్యకు పెద్ద పీట వేయాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్, శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. బుధవారం ప్రైవేట్ భవనంలో అంజుమన్ ఇ రజా ఆధ్వర్యంలో మైనార్టీ సమాజానికి చెందిన ప్రతిభావంత విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. నేడు విద్యా రంగానికి ఉన్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు. సమాజానికి ఉత్తమ సేవలందించిన దస్తగిరిని అభినందించారు. కార్యక్రమంలో సమాజం అధ్యక్షుడు రజాక్ ఉస్తాద్, సయ్యద్ తారిక్ హసన్, నూర్ మహ్మద్, అస్లాం పాషా, ఇక్బాల్, అబ్దుల్ కరీం, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఉపాధ్యక్షుడు బషీరుద్దీన్, అక్బర్ తదితరులున్నారు.
వైభవంగా పల్లకీ సేవ
రాయచూరు రూరల్: నగరంలో ఏరువాక పున్నమి సందర్భంగా ఆలయాలకు భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం నగరంలో కందగడ్డ మారెమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీ కనిపించింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గొర్రెలు, మేకపోతులను బలి ఇవ్వడానికి తీసుకొచ్చారు. కుంభ కలశాలతో ముత్తైదువులు పల్లకీ సేవ ఊరేగింపులో పాల్గొని దీపాలను వెలిగించారు.
జింకలను వేటాడి..
చర్మాన్ని వలిచి
● పరారైన దుండగులు
హుబ్లీ: జిల్లాలోని కుందగోళ తాలూకా గురివినహళ్లి గ్రామం అడవయ్య కుబిహాళ వద్ద పొలంలో మంగళవారం రాత్రి దుండగులు రెండు జింకలను వేటాడి చర్మం వలుచుకొని పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది జింకల చర్మం కోసమే చేసిన అకృత్యం అని తేల్చారు. ఈ ప్రాంతంలో చిరుతలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, వాటిని రక్షించాలని, అడవి జంతువుల నుంచి పంటల రక్షణకు అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని గురివినహళ్లి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మంజునాథ విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఘటనపై ఆర్ఎఫ్ఓతో మాట్లాడానని, ఘటనను పరిశీలించి కేసు దాఖలు చేయాలని కుందగోళ తహసీల్దార్ మావర్కర్ తెలిపారు.
కొండచిలువ పట్టివేత
అలాగే మరో ఘటనలో చెరుకు తోటలో 12 అడుగుల కొండ చిలువను అటవీ సిబ్బంది పట్టుకున్నారు. ధార్వాడ తాలూకా బణదూరు సమీపంలోని హళియాళ మార్గంలో చెరుకు తోటలో ఓ పెద్ద కొండ చిలువను పట్టుకున్నారు. ఈ కొండ చిలువను చూసిన రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అటవీ సిబ్బంది, ఉరగ సంరక్షకుడు సోమశేఖర్ కార్యాచరణ చేపట్టి కొండ చిలువను పట్టి అడవిలోకి వదిలారు. కొండ చిలువ అడవి నుంచి పొలం వైపునకు వచ్చింది. సుమారు 30 కేజీల బరువు, 12 అడుగుల పొడవు ఉన్న దీన్ని ఓ సంచిలో నింపుకొని అడవిలోకి తీసుకెళ్లి వదిలి వేసినట్లు డీఆర్ఎఫ్ఓ యూసుఫ్ బండారి ఓ ప్రకటనలో తెలిపారు.
మానవుడు ధర్మమార్గంలో పయనించాలి
రాయచూరు రూరల్: మానవుడు అరిషడ్ వర్గాలను త్యజించి ధర్మ మార్గంలో ప్రయాణించాలని ఆచార్య భగవంత 1008 పార్శ్వ చంద్రజీ పేర్కొన్నారు. రాయచూరుకు చెందిన పారిశ్రామికవేత్త దిలీప్ కుమార్ దోఖాకు సన్యాసాశ్రమ దీక్షను ఇచ్చి బోధనలు చేశారు. మానవుడి జీవితం కామ, క్రోధ, మోహ, లోభ, మధ, మాత్సర్యాల నుంచి విముక్తి పొందాలన్నారు. సమాజంలో ధర్మ సందేశాలను చాటి ప్రజల్లో హిందూ ధర్మ రక్షణకు నడుం బిగించాలన్నారు. లౌకిక సౌఖ్య సుఖ భోగాలను త్యజించాలన్నారు. కార్యక్రమంలో వర్దమాన స్థానికవాసి జైన్ శ్రావక సంఘ్ పరిత్యాగి డాక్టర్ శ్రుత నిధిజి, అధ్యక్షుడు శాంతిలాల్, విశ్వ కుమార్, ప్రసన్న చంద్, నరేంద్ర, గౌతం జియా, అశోక్ కుమార్ జైన్లున్నారు.

ఉన్నత విద్యకు పెద్ద పీట వేయాలి

ఉన్నత విద్యకు పెద్ద పీట వేయాలి

ఉన్నత విద్యకు పెద్ద పీట వేయాలి