ఊపిరి తీసిన కరెంటు స్తంభం | - | Sakshi
Sakshi News home page

ఊపిరి తీసిన కరెంటు స్తంభం

Jun 11 2025 11:31 AM | Updated on Jun 11 2025 11:31 AM

ఊపిరి తీసిన కరెంటు  స్తంభం

ఊపిరి తీసిన కరెంటు స్తంభం

బనశంకరి: విద్యుత్‌శాఖ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైంది. ఆడుకుంటున్న బాలిక విద్యుత్‌ షాక్‌తో మరణించిన ఘటన నగర శివార్లలో సూర్యనగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఆనేకల్‌ తాలూకా నారాయణఘట్ట గ్రామానికి చెందిన తనిష్కా (11), పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోంది. కరెంటు స్తంభాన్ని ముట్టుకున్న సమయంలో షాక్‌కు గురైంది. గాయపడిన బాలిక ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. బెస్కాం అధికారుల నిర్లక్ష్యమే కారణమని బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement