గూడ్స్‌ వ్యాన్‌ బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ వ్యాన్‌ బీభత్సం

Jun 11 2025 11:31 AM | Updated on Jun 11 2025 11:31 AM

గూడ్స్‌ వ్యాన్‌ బీభత్సం

గూడ్స్‌ వ్యాన్‌ బీభత్సం

యశవంతపుర: అతివేగంగా గూడ్స్‌ వ్యాన్‌ రెండు కార్లు, బైకును డీకొట్టింది, ఈ దుర్ఘటనలో ఓ మహిళ మరణించింది. బెంగళూరు అశోక్‌నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. హళేగుడ్డదగళ్లికి చెందిన అంజలి (36) మృతి చెందగా ఆమె భర్త విజయకుమార్‌ (40) గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం 6:30 గంటలకు హనీజ్‌ అనే వ్యక్తి గూడ్స్‌ వ్యాన్‌లో కాడుగోడి వైపు వెళుతున్నాడు. ఎంజీ రోడ్డు కావేరి ఎంపోరియం జంక్షన్‌ వైపు నుంచి వెళుతున్న కారును మేయోహాల్‌ జంక్షన్‌ వద్ద నిలిపారు. ఆ సమయంలో వేగంగా వెళుతున్న గూడ్స్‌ వ్యాన్‌ ఈ కారును, మరో కారును, అలాగే బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న అంజలి రోడ్డుపై పడిపోగా ఆమైపె నుంచి వ్యాన్‌ దూసుకెళ్లింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడే చనిపోయింది. భర్త కూడా గాయపడ్డాడు. చివరకు వ్యాన్‌ ఓ కరెంటు స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. వెంటనే డ్రైవర్‌ హనీజ్‌ పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. వ్యాన్‌ ధాటికి కార్లు కూడా ధ్వంసమయ్యాయి.

మహిళ మృతి, భర్తకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement