
గూడ్స్ వ్యాన్ బీభత్సం
యశవంతపుర: అతివేగంగా గూడ్స్ వ్యాన్ రెండు కార్లు, బైకును డీకొట్టింది, ఈ దుర్ఘటనలో ఓ మహిళ మరణించింది. బెంగళూరు అశోక్నగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. హళేగుడ్డదగళ్లికి చెందిన అంజలి (36) మృతి చెందగా ఆమె భర్త విజయకుమార్ (40) గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం 6:30 గంటలకు హనీజ్ అనే వ్యక్తి గూడ్స్ వ్యాన్లో కాడుగోడి వైపు వెళుతున్నాడు. ఎంజీ రోడ్డు కావేరి ఎంపోరియం జంక్షన్ వైపు నుంచి వెళుతున్న కారును మేయోహాల్ జంక్షన్ వద్ద నిలిపారు. ఆ సమయంలో వేగంగా వెళుతున్న గూడ్స్ వ్యాన్ ఈ కారును, మరో కారును, అలాగే బైక్ను ఢీకొట్టింది. బైక్పై వెళుతున్న అంజలి రోడ్డుపై పడిపోగా ఆమైపె నుంచి వ్యాన్ దూసుకెళ్లింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడే చనిపోయింది. భర్త కూడా గాయపడ్డాడు. చివరకు వ్యాన్ ఓ కరెంటు స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. వెంటనే డ్రైవర్ హనీజ్ పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. వ్యాన్ ధాటికి కార్లు కూడా ధ్వంసమయ్యాయి.
మహిళ మృతి, భర్తకు గాయాలు