
డిజిటల్ అరెస్టు.. రూ.4.79 కోట్ల వసూలు
● ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్టు
దొడ్డబళ్లాపురం: డిజిటల్ అరెస్టు పేరుతో రిటైర్డ్ ఇంజినీర్ను బెదిరించి రూ.4.79 కోట్లు వసూలు చేసిన సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. మంజునాథ్ మోసపోయిన బాధితుడు. ఈశ్వర్ సింగ్, నారాయణ్ అరైస్టెన నిందితులు. వివరాలు.. మంజునాథ్ నైజీరియాలో ఇంజినీర్గా పని చేసి రిటైరయ్యి బెంగళూరులో నివసిస్తున్నాడు. నిందితులు ఉత్తరాది రాష్ట్రాలవారు. ఇటీవల మంజునాథ్కు కాల్ చేసిన దుండగులు క్రెడిట్ కార్డ్ ఓవర్ డ్యూ అయ్యిందని, మీ ఖాతా నుంచి మనీ ల్యాండరింగ్ జరిగిందని, సీబీఐ వారు మీపై కేసు నమోదు చేసారని బెదిరించారు. నకిలీ అరెస్టు వారెంట్ను కూడా పంపించారు. త్వరలో తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బెదిరిపోయిన మంజునాథ్ వారు అడిగినట్టుగా పలు విడతలుగా రూ.4.79 కోట్లు ఆన్లైన్ ద్వారా పంపించాడు. మోసపోయినట్టు ఆలస్యంగా తెలుసుకున్న మంజునాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్క్రైం పోలీసులు గాలింపు జరిపి నిందితులను అరెస్టు చేశారు. దుండగులు ఈ డబ్బుతో శ్రీలంక వెళ్లి క్యాసినో ఆడి జల్సాలు చేసినట్లు తేలింది. దీంతో నిందితుల నుంచి పోయిన నగదును రాబట్టడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ముఠా వెనుక సూత్రధారులు ఉన్నారని, వారిని అరెస్టు చేయాల్సి ఉందని సమాచారం.