
ముంచెత్తిన వర్షం
రాయచూరు రూరల్: జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా రహదారులు జలమయమై బురద గుంటలుగా మారాయి. హైదరాబాద్ రహదారి, ఏపీఎంసీ, మున్నూరు వాడి, గాంధీ చౌక్, మహావీర్ చౌక్, ఆర్టీఓ సర్కిల్, కూరగాయల మార్కెట్లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పత్తేపూర్ వాగు పొంగి ప్రవహించడంతో ఆ మార్గంలోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి ఇతర గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాన్వి తాలూకాలో రైతులు పొలాల్లో వేసిన పత్తి విత్తనాలు మొలవడంతో వర్షపు నీటిలో పంటలు మునిగిపోయాయి.
రహదారులు జలమయం
లోతట్టులోకి చేరిన నీరు

ముంచెత్తిన వర్షం

ముంచెత్తిన వర్షం