
ఎద్దుల పండుగకు వేళాయె
రాయచూరు రూరల్: నగరంలో మంగళవారం నుంచి మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ముంగారు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఎద్దుల పండుగ జరుపుకుంటారు. మాజీ ఎమ్మెల్యే, మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు ఏ.పాపారెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ఎద్దులు రానున్నాయి. ఏరువాక పున్నమి సందర్భంగా ఏపీఎంసీ ఆవరణలో రాతి దూలం లాగే పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. రాయచూరు ఏపీఎంసీ మైదానంలో జరిగే ఉత్సవాలను గద్వాల సంస్థానాధిపతి, జీవీకే అధిపతి కృష్ణ రామ్ భూపాల్ ప్రారంభిస్తారని మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి తెలిపారు.
నేటి నుంచి మూడు రోజులు ఎద్దుల పండుగ
గద్వాల సంస్థానాధిపతి కృష్ణ రామ్ భూపాల్ ఉత్సవాలకు రాక

ఎద్దుల పండుగకు వేళాయె