
బంగారం దొరికేనా?
సాక్షి, బెంగళూరు: కన్నడనాట ఎక్కడెక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. అన్వేషణ బృందాలు గాలించి నివేదికలను అందిస్తాయి. బంగారం ఉత్పత్తిలో దేశంలోనే కర్ణాటకకు ప్రత్యేక స్థానం ఉంది. రాయచూరు జిల్లాలో హట్టిలో బంగారం మైనింగ్ జరుగుతోంది. పసిడి మైనింగ్కు కేరాఫ్ అడ్రస్గా ఉన్న కోలారు జిల్లా కేజీఎఫ్లో చాలా ఏళ్ల క్రితమే బంద్ అయ్యింది. ఈ క్రమంలో కర్ణాటకలో గణనీయంగా ఉన్నట్లు బంగారం నిక్షేపాలపై కేంద్రానికి పలు నివేదికలు, లేఖలు అందడంతో దృష్టి సారించింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో బంగారం నిల్వల కోసం అన్వేషణ ప్రారంభించింది. పలు మైనింగ్ సంస్థలు కర్ణాటకలో అన్వేషణలు సాగిస్తున్నాయి. అతి త్వరలో నివేదికను రూపొందించి పంపుతాయి. ఎంత బంగారం నిక్షేపాలు ఉన్నాయి, మైనింగ్ జరపడం లాభసాటా, కాదా? అనే అనేక విషయాలను పొందుపరుస్తాయి.
నివేదికలను బట్టి
2016–2017 ఆర్థిక ఏడాది నుంచి 2024–2025 వరకు రాష్ట్రంలోని 34 ప్రాంతాల్లో ఖనిజాన్వేషణకు ఎన్ఎంఈటీ (నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్టు)కు అనుమతి లభించింది. 34 చోట్లకు గాను 23 చోట్ల పూర్తి చేసింది. మిగిలిన 11 ప్రాంతాల్లో అనుమతి లభించలేదు. ఇటీవల గుర్తించిన ప్రాంతాల్లో అదనపు ఖనిజాల కోసం వెతుకులాట జరుగుతోంది. తొలి నివేదికలో ఖనిజాల లభ్యతపై సమాచారం ఇవ్వనుంది. ఆ తర్వాత రెండో నివేదికలో ఏ ప్రాంతంలో అత్యధిక బంగారం లభ్యత ఉందనే విషయంపై సమాచారం ఇవ్వనుంది. వాటి ఆధారంగా గనుల తవ్వకాల గురించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి.
బంగారం ఆచూకీ లభిస్తే మైనింగ్ రంగానికి ఊతం
కర్ణాటకలో పసిడి నిక్షేపాల అన్వేషణ
కేంద్రం ఆదేశాలతో పలు కంపెనీల సర్వేలు షురూ
ఎక్కడెక్కడ ఏ ఖనిజాల అన్వేషణ
ప్రాంతం ఖనిజాలు..
మండ్య (యడియూరు) బంగారం,
తామ్రం,
అల్యుమినియం,
బేస్ మెటల్,
చిక్కమగళూరు (కళశాపుర) బంగారం
హాసన్ (రామపుర, గొల్లరహట్టి) ఎన్–క్రోమైట్,
ప్లాటినం వర్గ లోహాలు
బళ్లారి (సిరిగెరె) బంగారం
హావేరి (నాగవంద్, కాకోళ్) బంగారం
దావణగెరె (కుదురెకొండ, హల్లవనగళ్లి) బంగారం
నేడు బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. గ్రాము బంగారం కొనడం పేదలకు కలగా మారింది. మధ్య తరగతికి భారమైంది. ఈ నేపథ్యంలో బంగారం గనులను కనుక్కోవడం అంటే నిధిని పొందినట్లే. అందుకే ప్రభుత్వాలు బంగారు గనుల కోసం శోధన చేపట్టాయి.

బంగారం దొరికేనా?

బంగారం దొరికేనా?

బంగారం దొరికేనా?