
బెంగళూరులో తిరిగొచ్చిన వాన
సాక్షి, బెంగళూరు: రుతు పవనాల ప్రభావంతో బెంగళూరు నగర వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు మొదలయ్యాయి. నగరంలోని 181 వార్డుల్లో సాధారణ వర్షపాతం నమోదయింది. జోరు గాలులతో కూడిన వర్షం కురిసింది. బెంగళూరు రాజరాజేశ్వరి నగర పరిధిలోని వివిధ వార్డుల్లో మధ్యాహ్నం నుంచి వాన ప్రారంభమైంది. వానతో వాహనదారులు రోడ్లపై తడిసిపోయారు. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. వీధి వ్యాపారులకు, వాహనాలకు, జనసంచారానికి ఆటంకమైంది. రోడ్లపై వర్షపు నీరు , డ్రైనేజీ నీరు పొంగి ప్రవహించింది. నగరంలో కొన్నిచోట్లు చెట్లు పడిపోయాయి. వాన రభసకు నాగరహళ్లి– సుమనహళ్లి రోడ్డులో లారీ పల్టీ కొట్టింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.
ఎండల నుంచి ఉపశమనం
కొన్ని రోజులుగా బెంగళూరులో ఎండలు కాస్తున్నాయి. ఉక్కపోతతో నగవాసులు ఇబ్బందులు పడ్డారు. గత వారం ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్ నుంచి 32 డిగ్రీలకు పెరిగాయి. వానలతో చల్లదనం వచ్చింది. ఈ నెల 11 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపారు. రాజధానిలో గరిష్టంగా 110 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. చలి వాతావరణం ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని పలు జిల్లాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. గంటకు 50–60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జోరుగా గాలివాన

బెంగళూరులో తిరిగొచ్చిన వాన

బెంగళూరులో తిరిగొచ్చిన వాన

బెంగళూరులో తిరిగొచ్చిన వాన