మోదీ సర్కారుకు సున్నా మార్కులే | - | Sakshi
Sakshi News home page

మోదీ సర్కారుకు సున్నా మార్కులే

Jun 10 2025 3:24 AM | Updated on Jun 10 2025 3:24 AM

మోదీ సర్కారుకు సున్నా మార్కులే

మోదీ సర్కారుకు సున్నా మార్కులే

శివాజీనగర: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సున్నా మార్కులు ఇస్తానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. మోదీ సర్కారు 11 సంవత్సరాలను పూర్తి చేసుకోవడంపై ఆయన సోమవారం మైసూరులో స్పందిస్తూ మోదీ జీవిస్తున్నదే ప్రచారం ద్వారా, ఆయన చేసిన ప్రముఖ భరోసాలలో ఏదీ కూడా నెరవేర్చలేదు. అందుచేత మోదీ ప్రభుత్వానికి జీరో మార్కులు ఇస్తానన్నారు. ప్రధాని పరిపాలనలో అబద్ధాల కు అధిక ప్రచారం లభిస్తోందని ఆరోపించారు.

గ్యారెంటీ పథకాలు కాపీ

తమ గ్యారెంటీ పథకాలను అమలు చేయ సాధ్యం కాదు, రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీస్తుందని మోదీ ప్రచారం చేశారు, ఆ తరువాత అవే గ్యారెంటీ పథకాలను కాపీ చేశారని ధ్వజమెత్తారు. గ్యారెంటీ పథకాలను విమర్శిస్తున్న మోదీ రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, డిల్లీలో వాటిని కాపీ చేసి అమల్లోకి తెచ్చారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల ఎవరికి అనుకూలమైంది. అచ్చే దిన్‌ వచ్చిందా, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తానన్నారు, ఇచ్చారా, రైతుల సమస్యలను పరిష్కరించారా అని ప్రశ్నించారు. 11 సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద అప ప్రచారం చేస్తున్నారని సిద్దరామయ్య దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పారు గానీ ఇవ్వలేదు. రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

వాగ్దానాలను నెరవేర్చలేదు

నిధుల్లో అన్యాయం: సీఎం సిద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement