
4 ఎమ్మెల్సీ సీట్లపై సందిగ్ధం
శివాజీనగర: సిద్దరామయ్య సర్కారు, రాజ్భవన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎలాగంటే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలందించినవారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలనుకుంది. రమేశ్బాబు, ఆరళి కృష్ణ, డీజీ సాగర్, మాజీ పాత్రికేయుడు దినేశ్ అమిన్ మట్టును విధాన పరిషత్కు నామినేట్ చేస్తున్నట్లు ఫైల్ను గవర్నర్ గెహ్లాట్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపింది. ఇది గత వారం జరిగింది.
వివాదం ఎందుకు
ఇందులో రమేశ్బాబు కాంగ్రెస్ నాయకుడు. కృష్ణ, డీ.జీ.సాగర్ కూడా కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలు, పాత్రికేయుడు దినేశ్ గతంలో ముఖ్యమంత్రి మీడియా సలహాదారుగా పనిచేశారు. ఇలా అందరు ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి సన్నిహిత వర్గంలోనివారే. కళలు, సంస్కృతి, సేవా రంగాలతో సంబంధం ఉందా, వీరిని ఎగువసభకు నామినేట్ చేయాలా అనే ప్రశ్నను గవర్నర్ లేవనెత్తారు. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాతనే ఆమోదం పై నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఫైలు పెండింగ్లో ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్నవారిని మేధావుల సభ అని పిలిచే ఎగువసభకు నామినేట్ చేయవచ్చా అని గవర్నర్ అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు తెలిసింది.
సర్కారు పంపిన ఫైల్.. రాజ్భవన్లో పెండింగ్