ఆస్తమా మందు.. మనకే ముందు | - | Sakshi
Sakshi News home page

ఆస్తమా మందు.. మనకే ముందు

Jun 9 2025 7:42 AM | Updated on Jun 9 2025 7:42 AM

ఆస్తమా మందు.. మనకే ముందు

ఆస్తమా మందు.. మనకే ముందు

కొప్పళ వద్ద కూటగానహళ్లిలో జనజాతర

రాయచూరు రూరల్‌: ఆస్తమా, ఉబ్బసం సమస్యలకు హైదరాబాద్‌లో చేపమందు ఇస్తారన్నది తెలిసిందే. మృగశిర కార్తె మొదలు కాగానే మందు పంపిణీ ఆరంభిస్తారు. ఇదే మాదిరిగా కొప్పళ జిల్లాలో ఓ గ్రామంలో ఆస్తమాకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తారు. ఇందుకోసం అనేక రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. ఆదివారం కూటగానహళ్లి బృహత్‌ జాతరను తలపించింది. పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా మందు కోసం వచ్చారు. గ్రామంలోని పాఠశాలలో కులకర్ణి కుటుంబం ఈ మందును పంపిణీ చేస్తోంది. మృగశిర కార్తెలో చంద్రుడు, నక్షత్ర గమనాన్ని అంచనా వేసి మందును పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ఆయుర్వేద మందు ఆస్తమా, ఉబ్బసంతో పాటు శ్వాసకోశ వ్యాధులకు రామబాణమని చెప్పారు. ఎండల వేడిమి ఉన్నప్పటికీ ప్రజలు గొడుగులు పట్టుకుని మందు కోసం నిరీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement