ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం వైద్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో గురువారం ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మైత్రి క్లినిక్లో ట్రాన్స్జెండర్లకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం, హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేశారు. హెచ్ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్–బీ, హెపటైటిస్–సి వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు చేశారు. డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, అదనపు డీఎంహెచ్వో డాక్టర్ సుధా రాజేంద్ర, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి పాల్గొన్నారు. – కరీంనగర్


