విద్యుత్ సంస్థలోని ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్ కార్మికులకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రెండోరోజు గురువారం తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది. కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఎదుట, హుజూరాబాద్లో నిరసన కొనసాగించారు. ఒకే సంస్థలో రెండు విధాల సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ సుమారు 19వేల మంది ఆర్టిజన్లను ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరారు. – కొత్తపల్లి(కరీంనగర్)/హుజూరాబాద్


