లారీ.. బారులుతీరి.. | - | Sakshi
Sakshi News home page

లారీ.. బారులుతీరి..

Jun 21 2025 3:39 AM | Updated on Jun 21 2025 3:39 AM

లారీ.. బారులుతీరి..

లారీ.. బారులుతీరి..

ఒకటి కాదు రెండు కాదు.. ఒకదాని వెంట మరొకటి.. వందల కొద్దీ లారీలు రైలు బోగీలను తలపిస్తూ రహదారిపై బారులు తీరాయి. లోడింగ్‌ ఇసుక కోసం కిలోమీటర్ల మేర నిలిచిన లారీలను చూస్తూ వచ్చిపోయే ప్రయాణికులు రైలు డబ్బాలను తలపిస్తున్నాయంటూ చమత్కరించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌ పల్లి వద్ద ఇసుక క్వారీ కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో డీడీలు కట్టి ఇసుక లోడింగ్‌ కోసం వచ్చిన లారీలు ఇలా రహదారిపై క్యూలో నిలపడం ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. కాగా, పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక లారీలతో తిప్పలు పడుతున్నామని రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేకపోలేదని వాపోతున్నారు రహదారి వెంట ఉన్న గ్రామాలవాసులు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement