
టీచర్ నుంచి రాష్ట్ర జట్టు కోచ్ వరకు..
శంకరపట్నం: వెంకటేశ్వర్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లక్కాకుల కోటేశ్వర్రావు 15 ఏళ్లుగా యోగాలో శిక్షణ ఇస్తున్నారు. బాబా రాందేవ్ వద్ద హరిద్వార్లో శిక్షణ పొందారు. యోగాతో ఏకాగ్రత పెరుగుతుందని, ధ్యానంతో మనసు ఉత్తేజపరుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు కోచ్గా శిక్షణ ఇవ్వడంతో తిరువనంతపురం, హిమాచల్ప్రదేశ్లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించారు.
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉప్పల శ్రీనివాస్ జీవన ప్రయాణమే యోగగా మారింది. ఆదియోగి నిత్య యోగ సాధనాలయం పేరిట శిక్షణసంస్థను నెలకొల్పి ఇప్పటికే వందలాది శిబిరాలను ఏర్పాటు చేశారు. చాలా మంది యోగా సాధకులను తయారు చేశారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని భావించి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.
శ్రీనివాస్.. జీవనయోగం

టీచర్ నుంచి రాష్ట్ర జట్టు కోచ్ వరకు..