ముగిసిన బడిబాట | - | Sakshi
Sakshi News home page

ముగిసిన బడిబాట

Jun 21 2025 3:17 AM | Updated on Jun 21 2025 3:17 AM

ముగిసిన బడిబాట

ముగిసిన బడిబాట

కరీంనగర్‌: ఈ విద్యా సంవత్సరంలో ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన ఆచార్య ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. కలెక్టర్‌, ఉన్నతాధికారులు , ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రవేశాలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఎంఈ వోలు మూతపడిన ఎనిమిది పాఠశాలలను తెరిపించడం విశేషం. శుక్రవారం వరకు 4,521 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తీసుకున్నారు.

కొత్తగా 4,521 మంది చేరిక

బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, మహిళ సంఘాలను భాగస్వాములను చేశారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 1,790 మంది, ప్రైవేట్‌పాఠశాలల నుంచి 1,330, నేరుగా ఆయా తరగతుల్లో ప్రవేశం పొందినవారు 1,401మంది మొత్తంగా 4,521 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే

నాణ్యమైన విద్య

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4521 మంది ప్రవేశాలు పొందారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం మెండుగా ఉంది. ఉపాధ్యాయులు ఆంగ్లంలో బోధించేలా సర్వం సిద్ధం చేశాం. తొలిరోజే పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నోట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌ 96 శాతం పంపిణీ చేశాం.

– శ్రీరామ్‌ మొండయ్య, డీఈవో

పెరిగిన ప్రవేశాలు 4,521 మంది చేరిక తెరుచుకున్న ఎనిమిది పాఠశాలలు

బడిబాటలో పంపిణీ చేసిన

పుస్తకాలు, దుస్తులు

పాఠ్యపుస్తకాలు 3,05,520

దుస్తులు 39,098

వర్క్‌బుక్స్‌ 40,838

నోట్‌బుక్స్‌ 2,23,183

విద్యార్థుల నమోదు ఇలా

1వ తరగతిలో చేరిన విద్యార్థులు 1,719

2 నుంచి 10వ తరగతి వరకు

చేరినవారు 1,401

ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలలో

చేరినవారు 1,330

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement