
గరుడ జంక్షన్పై కమిషనర్ ఆరా
సాక్షి ప్రతినిధి,కరీంనగర్: నగరంలోని పద్మనగర్ (గరుడ) జంక్షన్ పనులపై నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆరా తీశారు. రూ.కోటి జంక్షన్ పనులకు అదనంగా, టెండర్ లేకుండానే రూ.80 లక్షల పనులు కేటాయించడం, పనుల్లోనూ అక్రమాలకు ప్రయత్నిస్తుండడంపై ఈ నెల 19వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన ‘స్మార్ట్ పన్నాగం’ కథనానికి ఆయన స్పందించారు. శనివారం పద్మనగర్లో జంక్షన్ పనులను కమిషనర్ సందర్శించారు. జంక్షన్ మ్యాప్ను పరిశీలించారు. ఎం–15, ఎం–30 డిజైన్లలో ఏ డిజైన్తో పనులు చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. పనుల ఒప్పందం, నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు, నాణ్య తను పాటించాలని ఆదేశించారు. ఈఈలు సంజీవ్ కుమార్, యాదగిరి, డీఈలు లచ్చిరెడ్డి, అయూబ్ఖాన్ ఉన్నారు.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
కరీంనగర్కార్పొరేషన్: నగరం పరిశుభ్రంగా ఉండేలాచర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయి ఆదేశించారు. పరిసరాల్లో చెత్త కనిపించకుండా చూడాలని, ప్రతి స్వచ్ఛ ఆటో డీఆర్సీ సెంటర్లకు రావాలన్నారు. శనివారం నగరంలోని పలు డివిజన్లలో పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల రిజర్వాయర్ పరిధిలోని డీఆర్సీ సెంటర్ను సందర్శించారు. డ్రై రిసోర్స్ కలెక్షన్కు సంబంధించిన రిజిస్టర్ను తనిఖీచేశారు. నగరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. తడి చెత్తను కంపోస్టు కేంద్రాలకు, పొడి చెత్తను డీఆర్సీ కేంద్రాలకు తరలించాలన్నారు. నర్సరీల్లో పెంచే మొక్కలు ఎండి పోకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.
● పద్మనగర్లో పనులు పరిశీలన

గరుడ జంక్షన్పై కమిషనర్ ఆరా