లెక్చరర్లు లేరు.. చదువులెట్లా? | - | Sakshi
Sakshi News home page

లెక్చరర్లు లేరు.. చదువులెట్లా?

Jun 22 2025 3:56 AM | Updated on Jun 22 2025 3:56 AM

లెక్చ

లెక్చరర్లు లేరు.. చదువులెట్లా?

● జూనియర్‌ కళాశాలల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు ● కానరాని ఫిజికల్‌ డైరెక్టర్లు

కరీంనగర్‌:

సకల వసతులు కల్పించి విద్యార్థులను ఆకర్షించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నా.. సరిపడా బోధన, బోధనేతర సిబ్బంది లేక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు వెలవెలబోతున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా తెరచుకు న్న ప్రభుత్వ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. ప్రభుత్వ కళాశాలల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా ప్రవేశాలు పొందుతారు. బడుగు విద్యార్థుల బాగోగులే తమ లక్ష్యమని గొప్పలు చెప్పుకునే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరించకపోవడాన్ని చూస్తుంటే విద్యావ్యవస్థపై ఎంతటి ప్రేమ ఉందో ఇట్టే తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ కళాశాలలుండగా.. పది కళాశాలల్లో ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాలలో మాత్రమే ఒకే ఒక్క ఫిజికల్‌ డైరెక్టర్‌ విధులు నిర్వహిస్తున్నాడు. మిగతా పది మంది ఫిజికల్‌ డైరెక్టర్లు లేకపోవడం చూస్తుంటే వ్యాయామ విద్యపై ఎంతటి మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా కాంట్రాక్ట్‌, గెస్ట్‌ లెక్చరర్లతో కళాశాలల్లో తరగతులు బోధిస్తున్న ప్రభుత్వం.. గత విద్యాసంవత్సరంలో వారినే ఎక్కడికక్కడ రెగ్యులరైజ్‌ చేయడంతో బోధన సిబ్బంది కొరత కొంత తీరినట్లయింది. లైబ్రేరియన్లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేటర్ల నియమాక ప్రక్రియకు సంబంధించి గత విద్యాసంవత్సరంలో కొన్ని పోస్టులు భర్తీ కాగా.. మరికొన్ని పోస్టులు ఖాళీలుగానే వెక్కిరిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు మరో ఐదు ఖాళీలుగానే ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. సబ్జెక్టులవారీగా లెక్చరర్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం ప్రైవేట్‌ కళాశాలల్లో చదివేందుకే మొగ్గు చూపుతుండడం గమనార్హం. కళాశాలలు ప్రారంభమవుతుండడంతో.. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో మొదటి విడత ప్రక్రియ ముగియనుంది. మున్ముందు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కళాశాలల్లో లెక్చరర్లు లేకపోవడంతో పేద విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఇకనైనా ఇంటర్‌ విద్యావ్యవస్థపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పలువురు విద్యాభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వ పరిధిలోని అంశం

జిల్లాలో 11 జూనియర్‌ కళాశాలలున్నాయి. నేటి నుంచి కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 15 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 19 మంది గెస్ట్‌ లెక్చరర్లు, పది మంది ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధనేతర సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఇంటర్మీడియట్‌ విద్యామండలి, ప్రభుత్వ పరిధిలోని అంశం. ప్రస్తుతం బోధనకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటాం.

– గంగాధర్‌, డీఐఈవో

సవతి తల్లి ప్రేమ తగదు

ప్రభుత్వ విద్యావ్యవస్థపై పాలకులకు పట్టింపు లేదు. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైమరీ, ఇంటర్‌, ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా చేసిన పాలకుల వైఖరిని ఎండగట్టేందుకు విద్యార్థి లోకం ఏకం కావాల్సిన అవసరముంది. ఇకనైనా ప్రభుత్వం విద్యావ్యవస్థపై సవతి తల్లి ప్రేమను విడనాడాలి. కీలకమైన ఇంటర్‌ బోధనపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

– మచ్చ రమేశ్‌,

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఇంటర్‌ కళాశాలల్లో ఖాళీలిలా..

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు: 11

కాంట్రాక్ట్‌ లెక్చరర్లు: 15

గెస్ట్‌ లెక్చరర్లు: 19, ఫిజికల్‌ డైరెక్టర్లు: 10

లెక్చరర్లు లేరు.. చదువులెట్లా?1
1/2

లెక్చరర్లు లేరు.. చదువులెట్లా?

లెక్చరర్లు లేరు.. చదువులెట్లా?2
2/2

లెక్చరర్లు లేరు.. చదువులెట్లా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement