
ఉత్సాహంగా యోగా
కరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్క్రైం: జిల్లావ్యాప్తంగా యోగాడేను ఉత్సాహంగా జరుపుకున్నారు. వివిధ రకాల యోగాసనాలు వేసి ఆరోగ్యసూత్రాలను వివరించారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో పతంజలి యోగా సమితి, భారత్ స్వామిమాన్ ట్రస్ట్, యువభారత్, ఆయూష్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా నిర్వహించిన యోగాడేలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వై.సునీల్ రావు, గుగ్గిళ్లపు రమేశ్, డీఎంహెచ్వో వెంకటరమణ, యువభారత్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేశ్ పాల్గొన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖ, యోగా అసోసియేషన్ సంయుక్తంగా ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగాలో జాతీయస్థాయిలో రాణించిన వారిని సత్కరించారు. రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్ రెడ్డి పాల్గొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే మైదానంలో వికాస తరంగణి, ప్రజ్ఞ వికాస్ ఆధ్వర్యంలో, పరేడ్గ్రౌండ్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్, పోలీసులు పాల్గొన్నారు.