
నిందితులకు శిక్ష పడేలా పని చేయాలి
కరీంనగర్క్రైం: వివిధ కేసుల్లో సాక్షులను సకా లంలో కోర్టులో హాజరుపరిచి నిందితులకు శిక్ష పడే విధంగా కోర్టుడ్యూటీ ఆఫీసర్లు (సీడీవో) లు విధులు నిర్వహించాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. కమిషనరేట్ పరిధిలోని సీడీవోలతో శనివారం సమీక్ష నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులపై సమగ్రంగా ఆరా తీశారు. డీడీ, ఈ–పెట్టీ కేసుల పెండింగ్పై చర్చించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సీసీఆర్బీ ఏసీపీ విజయ్కుమార్, ఇన్స్పెక్టర్లు సరిలాల్, సంతోష్కుమార్ పాల్గొన్నారు.
‘కౌశిక్రెడ్డిపై కేసు సరికాదు’
కరీంనగర్: హుజూ రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై ప్ర భుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేయడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణరావు పేర్కొన్నారు. శనివారం నగరంలో మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయంలో ఎమెల్యే కౌశిక్రెడ్డిని అరెస్టు చేసి వరంగల్ సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించడాన్ని ఖండించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నించినందుకు కౌశిక్రెడ్డిపై కేసులు పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి బండి సంజయ్ రేవంత్రెడ్డితో కుమ్ముకై బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు.
బల్దియా కమిషనర్ను కలిసిన టీఎన్జీవోలు
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ప్రఫుల్ దేశాయ్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ డీడీగా బాధ్యతలు చేపట్టిన రంజిత చికిలేను తెలంగాణ నాన్గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు, టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కేంద్ర సంఘం నేతలు నాగుల నరసింహాస్వామి పాల్గొన్నారు.
అవకతవకలు జరగొద్దు
ఇల్లందకుంట: జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని గ్రామీణ అభివృద్ధిశాఖ జిల్లా అధికారి శ్రీధర్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో 4వ విడత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నిర్వహించారు. డీఆర్డీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆడిట్ నిర్వహించారు. మండలంలోని 18గ్రామాల్లో 2024–2025 సంవత్సరానికి గాను రూ.3.82కోట్ల పనులు జరిగాయన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు రికార్డు మెయింటెనెన్స్, మస్టర్ రోల్లో పేర్లు రాయకపోవడం, రికార్డుల విషయంలో పొరపాట్లు జరిగాయాని గుర్తించారు. రికార్డుల్లో పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్, ప్రదీప్ ఎంపీడీవో పుల్లయ్య, ఏపీవో రవికుమార్ పాల్గొన్నారు.
లాటరీ పద్ధతిలో ఎంపిక
విద్యానగర్: జిల్లాలోని బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో 2025–26 విద్యాసంవత్సరంలో 1వతరగతి(నాన్ రెసిడెన్షియల్), 5వతరగతి(రెసిడెన్షి యల్)లో ఎస్సీ విద్యార్థుల ప్రవేశాలను ఈనెల 25న ఉదయం 11 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు షెడ్యూల్డ్ కూలాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.

నిందితులకు శిక్ష పడేలా పని చేయాలి

నిందితులకు శిక్ష పడేలా పని చేయాలి