రేపు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ‘తుమ్మల’ | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ‘తుమ్మల’

Jun 21 2025 3:17 AM | Updated on Jun 21 2025 3:17 AM

రేపు

రేపు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ‘తుమ్మల’

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం జిల్లాకు రానున్నారు. ఇన్‌చార్జి మంత్రిగా గతంలో ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల నియామకం కావడం తెలిసిందే. మొదటిసారి ఆయన జిల్లాకు రానున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు.

డీజిల్‌ లేక నిలిచిన ట్యాంకర్లు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలో డీజిల్‌ లేకపోవడంతో ట్యాంకర్లు నిలిచిపోయా యి. గత డీజిల్‌ బకాయిలు రూ.5.50 లక్షలు చెల్లించకపోవడంతో పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన వాహనాలకు డీజిల్‌ పోయడం నిలిపివేసినట్లు సమాచారం. దీంతో శుక్రవారం ఆయా రిజర్వాయర్‌లలోని వాహనాలు కదలలేదు. గత నెల రోజులుగా డీజిల్‌ లేక వాహనాలు నిలిచిపోవడం ఇది రెండోసారి. డీజిల్‌ లేక వాహనాల సేవలు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు డీజిల్‌ వ్యవహారంపై దృష్టి సారించాల్సి ఉంది.

1.77లక్షల మంది రైతులు.. రూ.165 కోట్లు

కరీంనగర్‌ అర్బన్‌: రైతు భరోసా రైతుల ఖాతాకు చేరుతోంది. జిల్లాలో 2,10,904 మంది రైతులకు గాను ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.211.90 కోట్లు కేటాయించింది. ఈనెల 16న 1,24,727 లబ్ధిదారులకు రూ.65.79కోట్లు, 17న 27307 లబ్ధిదారులకు రూ.40.25 కోట్లు, 19న 15,995 మంది రైతులకు రూ.32.91 కోట్లు, 20న 9,955 మంది రైతులకు రూ.26.39 కోట్లు మొత్తం 1,77,984 మందికి రూ.165.35 కోట్లు జమయ్యాయని డీఏవో భాగ్యలక్ష్మి వివరించారు.

నేడు కళా భారతిలో సంగీత దినోత్సవం

కరీంనగర్‌ కల్చరల్‌: ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ప్రవీణ్‌ సల్వాజీ మ్యూజికల్‌ గ్రూప్‌, సల్వాజి ఈవెంట్స్‌, కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సంగీత దినోత్సవ వేడుక, కీర్తి ఘటించిన స్వర్గీయ కళాకారుల పేరిట స్మారక పురస్కారాల ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకుడు సల్వాజి ప్రవీణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉమ్మడి 10 జిల్లాల నుంచి కళాకారులు హాజరవుతారని, సంగీత విభావరి, నత్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సినిమా, జానపద పాటలు పాడే కళాకారులకు వాయిద్య సహకారం కల్పిస్తామన్నారు.

రేపు శాతవాహనలో వార్షిక క్రీడా దినోత్సవం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న విశ్వవిద్యాలయ వార్షిక, క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వైస్‌చాన్స్‌లర్‌ ఆచార్య ఉమేశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రతీ సంవత్సరం వార్షిక క్రీడా దినోత్సవ సందర్భంగా బోధన సిబ్బంది, విద్యార్థులకు క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, త్రో బాల్‌, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, అథ్లెటిక్స్‌, షటి ల్‌, క్రికెట్‌, చెస్‌, క్యారం, టేబుల్‌ టెన్నీస్‌ వ్యాసరచన, వకృత్వ పోటీలు ఉంటాయన్నారు.

రేపు జిల్లాకు ఇన్‌చార్జి  మంత్రి ‘తుమ్మల’1
1/1

రేపు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ‘తుమ్మల’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement