
ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ప్రమాదాలపై విద్యుత్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలి. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమాదాలపై పూర్తిస్థాయి విచారణ చేయాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎందుకు ప్రమాదం జరిగింది.. ఇకముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చ జరగాలి. ప్రమాదాలపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలి.
– దావ వసంత, జెడ్పీ మాజీ చైర్పర్సన్, జగిత్యాల
సిబ్బంది చనిపోవడం బాధాకరం
విద్యుత్ ప్రమాదాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది చనిపోవడం బాధాకరం. వినియోగదారులకు అవగాహన కల్పించినట్టుగానే క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి సైతం భద్రత చర్యలపై వివరిస్తున్నాం. ప్రతి విద్యుత్ ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు జరిగిందనే దానిపై పూర్తిస్థాయిలో మా బృందంతో విచారణ చేసి మరోసారి అలా జరగకుండా భద్రత చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. – సాలీయానాయక్, జిల్లా విద్యుత్ శాఖ అధికారి, జగిత్యాల

ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి