
వుషు సంఘం నూతన కార్యవర్గం
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా వుషు అసోసియేషన్ నూతన కార్యవర్గం సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా బార విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి కోడూరి శేఖర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మొయిన్ అహ్మద్, ఎ.శ్రీనివాస్, బి.రాజు, పి.లింగమూర్తి, సంయుక్త కార్యదర్శులు బి.రాణవిక్రంగాంధీ, జె.మహేశ్, ఎండీ ముఫాజిల్, పి.నాగరాజు, కోశాధికారి కె.అఖిల, కార్యవర్గ సభ్యులు జె.విజయ్ సామ్రాట్, జి.శివకృష్ణ, బి.రమేశ్, ఎల్.రవివర్మ, కె.సత్యనారాయణ, ఎం.శ్రీనివాస్ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి జి.అజయ్కుమార్ ప్రకటించారు. ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి ఎన్.సిద్దారెడ్డి, జిల్లా స్పోర్ట్ అథారిటీ నుంచి వి.కిష్టయ్య వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని వుషు అసోసియేష్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరమేశ్, జాల మనోహర్కుమార్ తదితర సంఘాల బాధ్యులు అభినందించారు.

వుషు సంఘం నూతన కార్యవర్గం