
వర్షాకాలం.. కరెంట్తో పైలం
● విద్యుత్తో అప్రమత్తత, జాగ్రత్త తప్పనిసరి ● అత్యవసర, అంతరాలుంటే 1912 టోల్ఫ్రీని సంప్రదించండి ● కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు/ రైతులు వర్షాకాలంలో విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు సూచించారు. విద్యుత్ అంతరాయం జరిగినప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడా రు. వినియోగదారులకు పలు సూచలు ఇచ్చారు.
తడిసిన ఉపకరణాలను తాకొద్దు
వర్షాలు కురుస్తున్నప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాల స్టేవైరు/సపోర్టు వైరు, తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకొద్దు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను ముట్టుకోవద్దు. అలాంటివి గమనిస్తే విద్యుత్ సిబ్బందికి తెలియజేస్తే సరిచేస్తారు. అనుమతిలేని వ్వక్తులు/వినియోగదారులు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లకు ఫ్యూజులు మార్చడం, సర్వీసు వైర్లు, వీధి దీపాలను సరి చేయడం కారణంగా విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. కావున జాగ్రత్తగా ఉండాలి.
ప్లాస్టిక్ దండేలు వాడాలి
బట్టలు ఆరవేసే జీఐ దండెం వైర్లపై నుంచి విద్యుత్ వైర్లు వెల్లడంతో విద్యుత్ వైర్లలో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం షాక్ గురయ్యే ప్రమాదం ఉంది. కనుక ప్లాస్టిక్ దండేలు ఉపయోగించాలి. ఇంటి ఎదుట రేకులకు విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉంది. విద్యుత్ సరఫరా వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండేలకు, రేకులకు తగలనివ్వకూడదు.
రైతులు జాగ్రత్త
రైతులు వ్యవసాయ పంపుసెట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. కరెంటు మోటార్లను కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను ఏమరపాటుతో తాకకూడదు. పంపుసెట్లను, స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయించుకోవాలి. సొంత కరెంట్ పనులు చేసుకొని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు. పశువులను మేతకు తీసుకువెళ్లినప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. పొలంలో విద్యుత్ కంచెలు వేయడం సైతం చట్టవ్యతిరేకం.
తెలిసినవారితో మరమ్మతు చేయించాలి
ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. మోటారు రిపేరు తెలిసిన వారి చేతనే మరమ్మతు చేయించుకోవాలి. వ్యవసాయ మోటార్లకు, గృహాలలో అతుకులు లేని సర్వీసు వైరు ఉపయోగించాలి. ఎవరికై నా కరెంట్ షాక్ తగిలితే ఆ వ్యక్తిని ముట్టుకోరాదు. షాక్కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని (కర్ర, ప్లాస్టిక్ లాంటి) వస్తువులను వాడాలి. విద్యుత్ లైన్ల కింద పందిరిలు వేసి జెండా గద్దెలు కట్టి విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. కరెంటు లైన్ల క్రింద పందిర్లు వేయరాదు. గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ఇన్స్పెక్టర్, సబ్ ఇంజినీర్, సెక్షన్ ఆఫీసర్ను సంప్రదించి వారిసేవలను పొందాలి.

వర్షాకాలం.. కరెంట్తో పైలం