
వృద్ధ దంపతుల ఇల్లు కూల్చివేత
శంకరపట్నం(మానకొండూర్): ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని కోడలు, మనవడు కలిసి ఇంటిని కూల్చివేశారని వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన వేల్పుల కొమురమ్మ– కనుకయ్యకు ముగ్గులు కొడుకులు. పెద్ద కొడుకు గణేశ్ చనిపోగా, మిగతా ఇద్దరు హైదరాబాద్లో పని చేస్తున్నారు. పెద్ద కోడలు లక్ష్మి, మనవడు ఉదయ్ వేరే నివాసం ఉంటుండగా, కొమురమ్మ– కనుకయ్య పెంకుటింట్లో ఉంటున్నారు. వీరికి ఇంటితో పాటు 4గుంటల ఖాళీ స్థలం ఉంది. పెద్ద కోడలుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోకుండా తాము నివాసం ఉంటున్న పెంకుటిట్లు పై కప్పును తొలగించి, గోడలు కూల్చివేస్తున్నారని సోమవారం వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. బ్లూకోల్ట్ పోలీసులు రాజాపూర్ చేరుకుని ఇంటిని కూల్చుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.