చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌

Jun 17 2025 5:38 AM | Updated on Jun 17 2025 5:38 AM

చోరీ

చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌

గంగాధర(చొప్పదండి): మండలంలోని వెంకటాయిపల్లి గ్రామంలో ఈనెల 8న చోరీకి పాల్పడిన నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్‌, గంగాధర ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. గంగాధర పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. వెంకటాయిపల్లికి చెందిన ఉప్పుగండ్ల గంగారెడ్డి ఈనెల 8న ఇంటికి తాళం వేసి తాగునీరు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈనెల 13న ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకొని 20 తులాల బంగారం స్వాధీనం చేసుకోగా, సోమవారం చందుర్తి మండలం రామరావుపల్లికి చెందిన పిట్టల అరవింద్‌ను అదుపులోకి తీసుకొని 3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ, ఎస్సై పేర్కొన్నారు.

పోగొట్టుకున్న పుస్తెలతాడు అప్పగింత

మల్యాల: మండలంలోని ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్లి పుస్తెలతాడు పోగొట్టుకున్న మహిళకు పోలీసులు తిరిగి అప్పగించారు. ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన సుజాత ఈనెల 15న కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చింది. ఈ క్రమంలో పుస్తెలతాడును పోగొట్టుకుంది. ఆ తాడు భక్తులకు దొరకడంతో వారు ఏఎస్సై శ్రీనివాస్‌కు అప్పగించారు. ఆయన మైక్‌లో అనౌన్స్‌ చేయగా.. సుజాత పోలీసులను సంప్రదించింది. దీంతో సోమవారం ఏఎస్సై రమణారెడ్డి మహిళ వివరాలు, ఆధార్‌కార్డు ఆధారంగా పరిశీలించి పుస్తెలతాడు అప్పగించారు. ఏఎస్సై, పోలీసులు అంజయ్య, తిరుపతి, రమేశ్‌కు సుజాత కృతజ్ఞతలు తెలిపింది.

చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌1
1/1

చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement