
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోండి
తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలో గల 574 సర్వే నంబర్లో 13.18ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ భూమిని కాపాడాలని అధికారులకు ఫిర్యాదు చేస్తే చోద్యం చూస్తున్నారు. వెంటనే భూ భారతి పోర్టల్లో ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చడంతో పాటు సదరు భూమికి హద్దులు నిర్ణయించి స్వాధీనం చేసుకోవాలి.
– సీపీఐ నాయకులు
నోటీస్ బోర్డులపై ఫీజులు ప్రదర్శించాలి
ప్రైవేట్ పాఠశాలల్లో విపరీతంగా దోచుకుంటున్నారు. అడ్మిషన్, ఐడెంటీ కార్డు ఇతరత్రా పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్స్ అంటూ యజమాన్యాలు ఇష్టారీతిగా డబ్బు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజులపై నియంత్రణ చర్యలు పక్కాగా ఉండాలి. ప్రతీ స్కూల్ నోటీస్బోర్డులపై ఫీజుల వివరాలు ప్రదర్శించేలా చర్యలుండాలి. నిబంధనల ప్రకారం సదుపాయాలు ఉండేలా చర్యలు చేపట్టాలి. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పారదర్శకంగా జరగాలి.
– నేషనల్ హ్యుమన్ రైట్స్
కౌన్సిల్ సభ్యులు(ఎన్జీవో)

ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోండి